ఏపీలో సీరో ప్రివలెన్స్ సర్వే

by  |
ఏపీలో సీరో ప్రివలెన్స్ సర్వే
X

అమరావతి: ఏపీలో సీరో ప్రివలెన్స్ సర్వే చేపడుతున్నామని, దీంతో ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నాయో స్పష్టత రానున్నది వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ప్రతి జిల్లాలోనూ 3,750 శాంపిల్స్ సేకరిస్తున్నామని, కృష్ణా, తూర్పు గోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు.

కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్ట్రాటజీతో వెళ్లొచ్చు అని, ఏపీలో కరోనా మరణాల రేటు 0.9 శాతంగా ఉంది.. మరణాల రేటు ఒక శాతానికి తక్కువ ఉంటే కరోనా చికిత్సలు బాగా జరుగుతున్నట్లేనని కేంద్రం కూడా చెబుతోందనని స్పష్టం చేశారు. ఏఎన్ఎంలకు పల్స్ ఆక్సీమీటర్లు ఇచ్చామని ఏదైనా ఇబ్బంది ఉంటే ఏఎన్ఎంలకు లేదా 104కి ఫోన్ చేయాలని సూచించారు.



Next Story