ఫిలిప్పీన్స్‌లో లక్ష దాటిన కేసులు

by  |
ఫిలిప్పీన్స్‌లో లక్ష దాటిన కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,032 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,185కు పెరిగాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు అక్కడ 2,059 మంది మృత్యువాత పడ్డారు. కాగా, గత నాలుగు రోజుల నుంచి ఫిలిప్పీన్స్‌లో పాజిటివ్ కేసులు 4 వేలు పైనే నమోదు అవుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేయడంతోనే వైరస్ విజృంభిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు 65వేల మందిపైగా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


Next Story

Most Viewed