నిర్మల్ జిల్లాలో తాజాగా 37 కేసులు, ఒకరు మృతి

by  |
నిర్మల్ జిల్లాలో తాజాగా 37 కేసులు, ఒకరు మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో శనివారం 37 మందికి కరోనా సోకింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భైంసా ఏరియా ఆసుపత్రి, నిర్మల్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. భైంసా లో 19 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. సారంగాపూర్ మండలంలో ఇద్దరికి, కడెం లో ఒకరికి కలిపి మొత్తం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 37 మంది కరోనా బారిన పడ్డారు. గత నాలుగు రోజుల క్రితం కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శి నగర్‌కు చెందిన ఒక మహిళ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించింది.


Next Story

Most Viewed