రైతు వేదికకు భూమి విరాళం..!

by  |
రైతు వేదికకు భూమి విరాళం..!
X

దిశ, నారాయణఖేడ్ :

గజం భూమి కోసం గొడవలు పడుతున్న నేటి సమాజంలో ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదిక కోసం 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చి ఉదారతను చాటుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలం కరసగుత్తి గ్రామానికి చెందిన మఠం గురుస్వామి.. కరసగుత్తి క్లస్టర్ పరిధిలో రైతు వేదిక నిర్మాణం కోసం స్థలం లేకపోవడంతో తన 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. దీంతో రైతు వేదిక నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. భూమినిచ్చిన గురుస్వామికి నాగలిగిద్ద మండల సమాఖ్య ఐకేపీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రశేఖర్, సీసీలు తుకారాం, శివానంద్, జయప్ప, సాయిలు వీఓఏ రవి , శాంతప్ప, వీఓ లీడర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed