తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

by  |
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
X

దిశ, వర్థన్నపేట
ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకివెళితే..ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన మడూరి సదానందం(49) అనే గీత కార్మికుడు రోజు మాదిరిగానే తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లాడు.

అయితే, చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. సదానందం మరణవార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed