నీ మనసాక్షిని నమ్ముకో : కృతి

by  |
నీ మనసాక్షిని నమ్ముకో : కృతి
X

దిశ, వెబ్ డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తి నిందితురాలిగా ఉంది. తన వల్లే కొడుకు చనిపోయాడని కేకే సింగ్, అభిమాన నటుడిని కోల్పోయామని ఫ్యాన్స్ రియాపై చాలా కోపంగా ఉన్నారు. ఇక కేసు విచారణకు హాజరయ్యే సమయంలో రియా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చూస్తూనే ఉన్నాం. ప్రతీసారి మీడియా తనను చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూనే ఉంది. తనను దోషిగా తేల్చుతూ న్యూస్ టెలికాస్ట్ చేస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే సుశాంత్ ఫ్రెండ్ కృతి సనన్ ఓ పోస్ట్ పెట్టింది. ‘నువ్వు జీవితంలో ఎవరినీ బతిమాలాల్సిన అవసరం లేదు.. కాబట్టి నువ్వు ప్రయత్నించకు. నిజం నీకు తెలిసినంత కాలం.. నువ్వు నీ మనస్సాక్షితో సమకాలీకరించినంత కాలం.. మీరు మీకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడేంత కాలం.. అద్దంలో మీరు చూసేది అర్థం చేసుకున్నంత కాలం.. జీవితంలో ఎలాంటి తుఫానులు ఎదురైనా సరే ఆ సందర్భంలోనూ శాంతిని కనుగొంటారు..’ అని పోస్ట్ పెట్టింది.

https://www.instagram.com/p/CE1Lw4TAaaC/?igshid=f32mrq6epgoc

రియాకు మద్దతుగా కృతి ఈ పోస్ట్ పెట్టిందని క్లియర్‌గా తెలుస్తుండగా.. తను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టలేదని తెలిపింది. దయచేసి దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయరాదని కోరింది కృతి.



Next Story

Most Viewed