ఉదారతను చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి

by  |
ఉదారతను చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, చేర్యాల: కొమురవెల్లిలో బుధవారం ఆత్మహత్య చేసుకున్న జంగపల్లి శంకర్ కుటుంబ సభ్యులను శుక్రవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. స్థానిక కాంగ్రెస్ ప్రతినిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించారు. శంకర్ కుటుంబానికి తన వంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు ఎంపీ కోమటిరెడ్డి.

భవిష్యత్తులో కూడా శంకర్ పిల్లల చదువుకు తన వంతు సహాయం అందిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమురవెళ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుడిగె గురువయ్య గౌడ్, చేర్యాల మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింగరావు, కొమురవెల్లి ఎంపీటీసీ -1 లింగంపల్లి కవిత భర్త కనకరాజు, ఎంపీటీసీ -2 కొయ్యడ రాజమణి భర్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed