- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఆనాటి కాలంలో ప్రజలు ఏ పని చేసినా కూడా అందులో పరమార్థం దాగి ఉంటది. శాస్త్రీయబద్ధంగా ఉండే వారి అలవాట్లలో కొన్ని ఇప్పటికే ప్రజలు అనుసరిస్తూనే ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటి కుండలో నీరు త్రాగడం. ప్రస్తుతం చాలామంది కుండలో నీళ్లే త్రాగుతుంటారు. ఎండకాలంలోనైతే చాలామంది కుండలో నీళ్లే త్రాగడానికి ఇష్టపడుతారు. వాళ్లు అలా ఆ నీళ్లు త్రాగుతుంటే మనకు ప్రత్యేకంగా అనిపిస్తారు. అంతేకాదు మనకు ఓ డౌట్ కూడా వస్తది. ఇదేంటి వీళ్లు కుండలో నీళ్లే ఎందుకు త్రాగుతున్నారని మనకు మనమే ప్రశ్నించుకుంటాం. అంతేకాదు ఇది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్నే. అయితే.. కుండలో నీళ్లే ఎందుకు సేవిస్తారంటే..? కుండలో నీళ్లు త్రాగితే చాలా లాభాలు కలుగుతాయి. అందులో కొన్ని.. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. జలబు చేయదు. అతి దాహం వేయదు. జీర్ణ సమస్యలను తగ్గిస్తది. వడదెబ్బ నుంచి కాపాడుతది. శరీరాన్ని లోపల నుంచి చల్లబరుస్తది. ఎసిడిటీని తగ్గిస్తది. శరీరంలో మెటబాలిజం రేటు మెరుగుపడుతది. వైరల్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తది. ఇలా చాలా రకాలుగా ఉపయోగాలెన్నో ఉన్నాయి. సో.. మీరు కూడా ఇక నుంచి కుండలో నీటినే తాగేందుకు ప్రాధాన్యతనివ్వండి.