‘ఐపీఎల్ కథ ముగిసినట్లే’

by  |
‘ఐపీఎల్ కథ ముగిసినట్లే’
X

దిశ, స్పోర్ట్స్: వచ్చే నెల 19నుంచి యూఏఈలో ఐపీఎల్-2020 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా సమయంలో ఈ టోర్నీ జరగడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఐపీఎల్ నిర్వహణపై ఎన్నో వదంతులు వినిపిస్తున్నాయి. కాని ఇప్పటికైతే ఐపీఎల్ జరుగుతున్న విషయం మాత్రమే యాజమాన్యాలకు తెలుసు. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది భద్రతలకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికే తొలి ప్రాధాన్యత ఇచ్చాం. అయితే, ఒక్క కరోనా కేసు నమోదైనా ఐపీఎల్ కథ ముగిసినట్లే. ఇప్పటి వరకు పడిన కష్టమంతా దేనికీ పనికిరాకుండా పోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామ’ని నెస్ వాడియా పేర్కొన్నారు.


Next Story