రెండు గంటల్లోనే కిడ్నాప్ కేసు సుఖాంతం

by  |
రెండు గంటల్లోనే కిడ్నాప్ కేసు సుఖాంతం
X

దిశ, వెబ్‌డెస్క్: నార్సింగి పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన తల్లీ, కొడుకును క్షేమంగా రక్షించారు. వివరాల్లోకివెళితే.. ఆదిలక్ష్మీ, ఆమె కొడుకు ప్రజ్వల్ నాంపల్లి కోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, బుధవారం స్థానిక ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఆదిలక్ష్మి, ఆమె కుమారుడు ప్రజ్వల్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు, రెండు గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను ఛేదించారు. బాధితులను సురక్షితంగా కాపాడి, కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని నార్సింగి పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed