బెడ్ దొరక్క మాజీ ఎమ్మెల్యే తమ్ముడి మృతి

by  |
బెడ్ దొరక్క మాజీ ఎమ్మెల్యే తమ్ముడి మృతి
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. క్వారంటైన్ సెంటర్లు, కరోనా కిట్లు, ఆస్పత్రలు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ కంట్రోల్‌లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని కరోనా పరిస్థితులపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, విజయవాడలో ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు కరోనా బారినపడ్డాడని తెలిపారు. ఆసుపత్రిలో బెడ్ దొరక్క నిన్న అంతా రోడ్డు మీద అంబులెన్స్ లోనే ఉండి ఇవాళ తెల్లవారుజామున మరణించాడని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఊహించడానికే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అర్ఆర్ఆర్‌కి అవంతి వార్నింగ్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed