ప్రధానికి కేరళ సీఎం పినరయి లేఖ

by  |
ప్రధానికి కేరళ సీఎం పినరయి లేఖ
X

తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళలో సంచలనం రేపుతుండగా రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ స్మగ్లింగ్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం వేస్తుందని పేర్కొంటూ ఈ కేసుపై సెంట్రల్ ఏజెన్సీలతో దర్యాప్తు నిర్వహించాలని లేఖలో కోరారు. ఈ కేసులో ప్రతి లింక్‌పై దర్యాప్తు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీనిచ్చారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో జులై 5న 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed