బాలు మృతిపట్ల కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి

by  |
బాలు మృతిపట్ల కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయకుడిగా భారతీయులందరికీ బాలు అభిమాని అయ్యారని తెలిపారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా బాలు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానూభూతిని తెలిపారు.


Next Story

Most Viewed