ఇవాళ కవిత నిరసన వ్యక్తం చేస్తదంట

by  |
ఇవాళ కవిత నిరసన వ్యక్తం చేస్తదంట
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత నేడు నిరసన వ్యక్తం చేయనున్నారని సమాచారం. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. అయితే.. అందులో భాగంగా హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొనున్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే నెల 2న జరిగే దేశవ్యాప్త బొగ్గు గనుల సమ్మెలో కూడా ఆమె పాల్గొంటారని తెలిసింది.



Next Story

Most Viewed