వాళ్లే నష్టపరిహారం చెల్లించాలి : బసవరాజ్

by  |
వాళ్లే నష్టపరిహారం చెల్లించాలి : బసవరాజ్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లర్లు, నిరసనల సమయంలో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూరుస్తారో వాళ్లే పరిహారం కూడా చెల్లించాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయ్ స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ఆయన అలాంటి వారిని ఉద్దేశించి హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల విధ్వంసానికి నష్టపరిహారం వసూలు చేసేలా ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. నిరసలు, అల్లర్ల సమయంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగితే, విధ్వంసకారులే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.

తాము ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఆస్తులను ధ్వంసం చేసినవారిని గుర్తిస్తున్నామని, నష్టాన్ని అంచనా వేసి, విధ్వంసకారుల నుంచి వాటిని రాబట్టేలా చర్యలు చేపడుడున్నట్లు ఆయన మరోసారి స్పష్టంచేశారు.


Next Story

Most Viewed