- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అల్లర్లు, నిరసనల సమయంలో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూరుస్తారో వాళ్లే పరిహారం కూడా చెల్లించాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయ్ స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం ఆయన అలాంటి వారిని ఉద్దేశించి హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల విధ్వంసానికి నష్టపరిహారం వసూలు చేసేలా ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. నిరసలు, అల్లర్ల సమయంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగితే, విధ్వంసకారులే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు.
తాము ఆ దిశగా తక్షణమే చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఆస్తులను ధ్వంసం చేసినవారిని గుర్తిస్తున్నామని, నష్టాన్ని అంచనా వేసి, విధ్వంసకారుల నుంచి వాటిని రాబట్టేలా చర్యలు చేపడుడున్నట్లు ఆయన మరోసారి స్పష్టంచేశారు.
Next Story