ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తిపై కంగనా సెటైర్..

by  |
ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తిపై కంగనా సెటైర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.. తన కొడుకు మృతికి అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తే కారణమని సుశాంత్ తండ్రి బీహార్‌లో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.ఈ మేరకు కేసు విచారణ కూడా జరుగుతోంది.

తాజాగా సుశాంత్ మృతి కేసులో ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలంటూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రజలను కోరారు. సుశాంత్ మృతి పట్ల ఉద్దవ్ స్పందించిన తీరును బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ తప్పుపట్టింది. సుశాంత్‌ కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వండని ప్రపంచ మేటి సీఎం ఉద్దవ్‌ అడుగుతున్నారని, అంటే ఇప్పుడు ప్రజలే సుశాంత్ మృతికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వాలా’ అని కంగనా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

ముంబై పోలీసులు కనీసం క్రైమ్‌సీన్‌ను కూడా సీజ్ చేయలేదన్నారు. ఘటనా స్థలం నుంచి వెంట్రుకలు, ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులు తీసుకోలేదన్నారు. కానీ, బెస్ట్ సీఎం ఉద్దవ్ మాత్రం ప్రజల నుంచి ఆధారాలు కోరుతున్నారని కంగనా ఆరోపించారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి సుశాంత్ వెళ్లిపోవాలని అతని స్నేహితుడు సమితతో చెప్పారని, సుశాంత్ ప్రాణభయంతో వణికిపోయాడని, తనను చంపేందుకు కుట్ర జరుగుతున్నట్లు సుశాంత్ అతని స్నేహితుడికి చెప్పాడని కంగనా తన ట్వీట్లో పేర్కొన్నది. సుశాంత్‌ది సూసైడ్ అని సీఎం కేవలం రెండు నిమిషాల్లోనే తేల్చేశారని, కానీ మూవీ మాఫియా మాత్రం మానసిక కోణాన్ని సాకుగా చూపుతోందని కంగనా ట్వీట్ లో పేర్కొంది.


Next Story

Most Viewed