కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు పాటించాలి

by Shyam |
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు పాటించాలి
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణ కోసం ప్రజలు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమాలు పాటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ యోగా ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, కరోనా కట్టడిపై మన రాష్ట్రం-దేశం తీసుకుంటున చర్యలు అభినందనీయమన్నారు. కరోనాపై ఆందోళనలు వద్దని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జూపల్లి సూచించారు. రైతులు, కూలీలు తమ వ్యవసాయ పనులు చేసుకుంటూనే కరోనా నియంత్రణ పాటించాలన్నారు. మన దేశంలో పుట్టిన యోగాను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని, యావత్తు దేశం మొత్తం ఒక సంఘటిత శక్తిగా తయారైందని జూపల్లి అభిప్రాయం వ్యక్త పరిచారు.

tag: Jupalli Krishnarao, comments, Follow the rules, central and state governments



Next Story

Most Viewed