- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులు.. చివరి తేది ఇదే!

దిశ,వెబ్ డెస్క్ : రైల్వేలో ఉద్యోగాల జాతర మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వారు, సంబంధిత రంగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులని అధికారులు తెలిపారు. 2025 జూలై 1వ తేదీ నాటికి 18-30 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన అభ్యర్థులు మే 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9. www.indianrailways.gov.in
మరోవైపు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 98 టెక్నిషియన్ పోస్టులతో పాటు గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. టెక్నిషియన్ పోస్టుల్లో డిప్లొమా టెక్నిషియన్(మెకానికల్) 20, డిప్లొమా టెక్నిషియన్(ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్) 26, ఆపరేటర్(ఫిట్టర్) 34, ఆపరేటర్(ఎలక్ట్రిషియన్), ఆపరేటర్(మెషినిస్ట్)3, ఆపరేటర్(షీట్ మెటల్ వర్కర్)1 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఐటీఐ పాసైన వారు అర్హులు. ఈనెల 18వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.