- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
JEE అడ్వాన్స్డ్.. విద్యార్థులకు మరో ఛాన్స్

దిశ, వెబ్డెస్క్ :
కరోనా కారణంగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ రాయలేకపోయిన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (JAB) మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసి రాయలేకపోయిన విద్యార్థులందరూ వచ్చే ఏడాది ఈ పరీక్ష రాయడానికి అనుమతినిస్తూ మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఐఐటీలకు ప్రవేశం కల్పించే ఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులకు సాధారణంగా రెండుసార్లే అవకాశముంటుంది. ఇప్పటికే ఒకసారి రాసి, మరోసారి దరఖాస్తు చేసి కరోనా కారణంగా రాయలేకపోయిన వారికీ ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే, వచ్చే ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాసేవారు మళ్లీ జేఈఈ మెయిన్స్ అర్హత సాధించాలన్న షరతును అమలు చేయడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ రాసినవారితో సమాన అవకాశాన్ని కల్పించినట్టవుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ వెల్లడించింది.