బ్రైడల్ లుక్‌లో అదిరిపోయిన జాన్వీ

by  |
బ్రైడల్ లుక్‌లో అదిరిపోయిన జాన్వీ
X

దిశ, వెబ్ డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి అందాన్ని మరిపిస్తోంది కూతురు జాన్వీ కపూర్. మనీష్ మల్హోత్రా లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్ లాంచ్ కాగా.. వాటిని ధరించిన జాన్వీ ఆ వస్త్రాలకే వన్నె తెస్తూ అత్యంత సుందరమైన వధువుగా దర్శనం ఇచ్చింది. హెన్నా గ్రీన్ లెహెంగా, ట్రెడిషనల్ జువెలరీతో గార్జియస్ లుక్‌లో అమేజింగ్‌గా ఉంది. తనను తాను చూసి మురిసిపోతున్న జాన్వీ.. ఈ సందర్భంగా స్పెషల్ పోస్ట్ కూడా పెట్టింది. మీరూ షెహనాయ్ వింటున్నారా? లేక నేను ఒక్కదాన్నే వింటున్నానా? అని ప్రశ్నిస్తూ.. మనీష్ మల్హోత్రా సూపర్ కలెక్షన్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ వైబ్, స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది. పెళ్లి కూతురిగా బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ లుక్‌కు అటు సినీ స్టార్స్, ఇటు అభిమానులు కూడా ఫిదా కాగా.. సూపర్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

https://www.instagram.com/p/CFfHVTnloNd/?igshid=1wm7irvi2t1t

కాగా, జాన్వీ చివరగా ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రాగా.. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది జాన్వీ. ‘నేను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం.. అభిమానులు, అమ్మానాన్న నాకిచ్చిన సపోర్ట్ అని, వారు పంచిన ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని తెలిపింది. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడతానని.. ఆ ప్రేమకు ఎంతో కొంత తిరిగి ఇస్తామని చెప్పింది జాన్వీ. కాగా జాన్వీ ప్రస్తుతం ‘రూహి అఫ్జానా, దోస్తానా 2’ చిత్రాలతో బిజీగా ఉంది.


Next Story