శిరోముండనం ఆరోపణల్లో నిజం లేదు : జనసేన

by  |
శిరోముండనం ఆరోపణల్లో నిజం లేదు : జనసేన
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని వైజాగ్‌ జిల్లా పెందుర్తిలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన కేసులో జనసేన పాత్ర ఉందని వస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ అన్నారు. కావాలనే జనసేన పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వాటిని ఖండిస్తున్నామన్నారు.

శిరోముండనం కేసులో పట్టుబడిన నిందితులు జనసేన పార్టీకి చెందిన వారుగా చిత్రీకరిస్తున్నారని.. ఆ ఘటనకు జనసేనకు అసలు సంబంధం లేదని శివశంకర్ మరోసారి స్పష్టంచేశారు. ఆ కేసులో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా, మరోసారి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


Next Story

Most Viewed