నిధులను మళ్లించే హక్కు వారికి ఎక్కడిది….

by  |
నిధులను మళ్లించే హక్కు వారికి ఎక్కడిది….
X

దిశ వెబ్ డెస్క్:
భవన కార్మికుల సంక్షేమ నిధులను మళ్లించేందుకు ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో భవన కార్మికులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కానీ వారి సంక్షేమ నిధి నుంచి నిధులను మళ్లిస్తోందంటూ విమర్శించారు. ఏపీలో 22లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న నిర్మాణ కార్మికులు ఉన్నారని ఆయన అన్నారు. మొదట రాష్ట్రంలో ఇసుక కొరత మొదలైందన్నారు. ఇప్పుడు కరోనా పరిస్థితులు వచ్చాయని తెలిపారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైందని ఆయన తెలిపారు. ఇక ఇప్నుడు భవన కార్మికుల సంక్షేమ నిధుల నుంచి రూ.450 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం సొంత అవసరాలకోసం మళ్లించిదని అన్నారు.


Next Story

Most Viewed