ఇంట్లోనే జాన్వీ, ఖుషీ ఫొటో షూట్!

by  |
ఇంట్లోనే జాన్వీ, ఖుషీ ఫొటో షూట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తుంటారు. ప్రతీ విషయంలో ప్రత్యామ్నాయం వెతికేందుకు ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఓ క్రేజీ పని చేశారు. కరోనా టైమ్, లాక్‌డౌన్ కారణంగా బయటకెళ్లి ఫొటో షూట్ చేయలేకపోతున్నారని.. ఇంటికే స్టూడియోను తెచ్చేశారు. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? చాలా సింపుల్.. మీకు మీరే ఇలా స్టూడియో తయారు చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సజెస్ట్ చేస్తున్నారు.

ఒక నార్మల్ క్లాత్ తీసుకుని బ్యాక్‌గ్రౌండ్ మ్యాట్‌గా యూజ్ చేసిన జాన్వీ సిస్టర్స్.. టేప్ తీసుకుని క్లాత్‌ను గోడకు అటాచ్ చేస్తే సరిపోతుందని వివరించారు. ఆ తర్వాత కెమెరాకు బదులుగా ఆ సెటప్ ముందు కలర్‌ఫుల్ రింగ్ ఒకటి సెట్ చేసి అందులో సెల్‌ఫోన్ అమర్చారు. సూపర్ కూల్‌గా ఉన్న ఈ హోమ్ మేడ్ స్టూడియోలో జాన్వీ ‘పార్టనర్ ఇన్ క్రైమ్’ ఖుషికి ఫొటో షూట్ చేసింది.

అంతేకాదు, జాన్వీ పెయింటింగ్ మీద కూడా కాన్సంట్రేషన్ ఎక్కువగానే పెట్టింది. బెస్ట్ పెయింటర్‌గా మారేందుకు ట్రై చేస్తున్నానని చెప్తోంది. ఈ మధ్యే ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’తో హిట్ అందుకున్న జాన్వీ.. రూహ్ అఫ్జాతో మరోసారి ఓటీటీలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed