మెరుగైన వైద్యం అందించండి: జగన్

by  |
మెరుగైన వైద్యం అందించండి: జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వివరించడంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఫిర్యాదు రాగానే కలెక్టర్, సీపీ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని అధికారులు చెప్పడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సమాచారమందించాలని సూచించారు.


Next Story

Most Viewed