అంబేద్కర్​ విగ్రహాల మాయంపై ఆందోళన

by  |
అంబేద్కర్​ విగ్రహాల మాయంపై ఆందోళన
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతిలో ఐదు నమూనా అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడంపై దళిత జేఏసీ భగ్గుమంది. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, లైబ్రరీ, పార్క్‌ను, స్వరాజ్య మైదానానికి మార్చడాన్ని జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్మృతివనం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. శాకమూరులోని అంబేద్కర్ స్మృతివనం వద్ద ఐదు విగ్రహాలు మాయమయ్యాయని దళిత జేఏసీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Next Story