- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా తెలుగు మీడియాలో ప్రధానంగా వస్తున్న వార్త 139 మంది చేతిలో అత్యాచారానికి గురైన యువతి కేసు. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. రాజకీయ నాయకులు, పోలీసులు, ఇండస్ట్రీ వ్యక్తులపై ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో బాధితురాలితోపాటు ప్రధానంగా వినిపిస్తున్న పేరు డాలర్ భాయ్.
దిశతో 139 మందిపై అత్యాచారం కేసు పెట్టించడంలో డాలర్ భాయ్ పాత్ర ఉన్నట్లు వెల్లడవుతోంది. దిశ ఆడియోలతో పాటు డాలర్ భాయ్ అనే వ్యక్తి మాట్లాడిన ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ వేగవంతం చేసిన సీసీఎస్ పోలీసులు… డాలర్ భాయ్ పైన కూడా దృష్టి పెట్టారు. అతడు ఎవరన్న కోణంలోనూ దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో రాజా శ్రీకర్రెడ్డి అలియాస్ డాలర్ భాయ్ని టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డాలర్ భాయ్ను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. బాధితురాలిని తన చెరలో ఉంచుకుని ఏదైనా డ్రామా ఆడాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
కాగా యువతి ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని గాడ్పవర్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఇందులో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. అయితే డాలర్ భాయ్కి సంబంధించిన వివరాలు మాత్రం దొరకలేదు. ఇటీవల రాజా శ్రీకర్రెడ్డిపై అతని భార్య కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.