పీవీ క్యారికేచర్ పోటీ విజేతలు వీరే

by  |
పీవీ క్యారికేచర్ పోటీ విజేతలు వీరే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పీవీ క్యారికేచర్ పోటీ ఫలితాలను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి ప్రకటించారు. మొదటి స్థానంలో పెరు దేశానికి చెందిన ఉమర్ జెవెల్లా, రెండవ స్థానంలో సిరియాకు చెందిన రెడ్ ఖళీల్, మూడో స్థానంలో ఇండియాకు చెందిన నంజునాథ స్వామి వైఎస్‌లు నిలిచారని ఆయన తెలిపారు. స్పెషల్ ప్రైజులకు భారత్‌కు చెందిన కె. దుర్గా భవాని, అశోక్ భోగా, తునికి భూపతిలు ఎంపికయినట్టు రాజమౌళి తెలియజేశారు. పీవీ జన్మదినం పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా 100దేశాల్లో ప్రచారం చేశామని, 29దేశాలకు చెందిన ఆర్టిస్టులు ఈ పోటీలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 225ఎంట్రీలు వచ్చినట్లు తెలియజేశారు. త్వరలో ఈ క్యారికేచర్లతో బెంగళూర్‌లో ప్రదర్శన కూడా నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కూడా రాష్ట్రంలో మరో ప్రదర్శనను కూడా నిర్వహించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed