కన్నీటి పర్యంతం.. విద్యార్థి మృతదేహం

by  |
కన్నీటి పర్యంతం.. విద్యార్థి మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్: వాగులో గల్లంతై ఇంటర్ విద్యార్థి మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో కల్లూరు మండలం నెరవాడ వక్కెర వాగు కూడా పొంగిపొర్లుతున్నాయి.

అయితే ఓ ఇంటర్ విద్యార్థి ఆ వాగును దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ వాగులో అతను గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Next Story

Most Viewed