వ్యవసాయ బిల్లుతో రైతులకు అన్యాయం..!

by  |
వ్యవసాయ బిల్లుతో రైతులకు అన్యాయం..!
X

దిశ, నారాయణఖేడ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్, వ్యవసాయ సవరణ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‎రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ అధ్యక్షురాలు చాందీబాయి చౌహాన్, జెడ్పీటీసీ లక్ష్మీభాయి, ఎంపీడీవో బన్సీలాల్, గ్రామాల సర్పంచ్‎లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో రైతులకు కరెంటు బిల్లులు అదనంగా వస్తాయని తెలిపారు. వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కదని ఆరోపించారు.


Next Story

Most Viewed