సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కియారా..

by  |
సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కియారా..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటీ కియారా అద్వానీ లేటెస్ట్ మూవీ అప్‌డేట్ ఇచ్చింది. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వంలో వస్తున్న ‘ఇందూ కీ జవానీ’ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. జూన్ 5న థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడగా.. డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ఎంచుకున్నట్లు తెలుపుతూ యూనిక్ స్టైల్‌లో టీజర్ విడుదల చేసింది మూవీ యూనిట్.

కామెడీ క్రాకింగ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సినిమాలో ఘజియాబాద్‌కు చెందిన ఇందూ గుప్తాగా సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వబోతుంది కియారా. ఇందుకోసం డిక్షన్, ప్రొనౌన్సియేషన్ మీద స్పెషల్ వర్క్ చేసిన భామ.. ఘజియాబాద్‌కు చెందిన యువతిగా తన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌లోనూ సూపర్ చేంజెస్ చూపించింది.

కాగా లేటెస్ట్‌గా రిలీజైన టీజర్‌లో తనను తాను ‘ఇందు’గా పరిచయం చేసుకున్న కియారా.. ప్రేక్షకులకో సీక్రెట్ చెప్పింది. తను డేటింగ్ యాప్‌లో డేట్ ఫిక్స్ చేశా అని తెలిపింది. ఫ్రెండ్స్ అందరు అందరూ అడుగుతున్నారు.. డేట్ ఎప్పుడు? ఎప్పుడు? అని, అందుకే సెప్టెంబర్ 16న ఫిక్స్ చేశా! అని చెప్పింది. ‘నేనైతే టైమ్‌కు వస్తాను.. మీరు లేట్ చేయొద్దు. ‘ఇందు’ను కలిసేందుకు కొంచెం వెయిట్ చేయండి..’ అని చెప్పింది. తద్వారా రెండు రోజుల్లో సూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చెప్పిన ‘ఇందూ కీ జవానీ’ టీమ్.. ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతుంది. నిఖిల్ అద్వానీ, మోనిషా అద్వానీ, మధు జి. భోజ్వానీ, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి హిమేష్ రేష్మియా, తనిష్క్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read Also…

నిరాల బాబా ‘ఆశ్రమ్’ కథేంటి?


Next Story

Most Viewed