- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి నేపథ్యంలో మరో క్రికెట్ సిరీస్ రద్దయ్యింది. ఐసీసీ ఎఫ్టీపీ ప్రకారం జులైలో టీం ఇండియా శ్రీలంకలో పర్యటించాలి. దీనిలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఆటగాళ్లను శ్రీలంక పంపడం సాధ్యం కాదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి సమాచారం అందించడంతో.. ఈ విషయాన్ని ఐసీసీ తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. కనీసం శ్రీలంకలో అయినా మ్యాచ్లు జరుగుతాయని ఆశించిన క్రికెట్ అభిమానులకు ఈ వాయిదా వార్త నిరుత్సాహానికి గురి చేసింది. కాగా, అగస్టు నెలలో పర్యటనకు రావాలని బీసీసీఐకి శ్రీలంక చేసిన విజ్ఞప్తి ఇంకా సందిగ్దంలోనే ఉంది.
Next Story