భారత్: 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు

by  |
భారత్: 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు కరోనా కోరలకు చిక్కి మృత్యువాత పడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 68,898 కొత్త కేసులు నమోదయ్యాయి. 983 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 29 లక్షల 5,823 కు చేరింది. 21 లక్షల 58,946 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6 లక్షల 92,2028 మంది బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా భారత్ లో ఇప్పటివరకు 54,849 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 62,282 మంది డిశ్చార్జ్ అయ్యారు.


Next Story

Most Viewed