బ్రెజిల్‌ను దాటేసిన భారత్..

by  |
బ్రెజిల్‌ను దాటేసిన భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసుల నమోదులో భారత్ దూసుకుపోతుంది. తాజాగా బ్రెజిల్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే దేశంలో 42లక్షల కేసులు కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో దేశంలో 90,802 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అలాగే కరోనా సోకి ఒక్కరోజులో 1,016 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 71,642 మృతి చెందగా, వైద్యం అనంతరం 32,50,429 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 8,82,542 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.



Next Story