దేశంలో ఒక్కరోజే 75,809 కేసులు..

by  |
దేశంలో ఒక్కరోజే 75,809 కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే బ్రెజిల్‌ను దాటేసిన భారత్ ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. గడచిన 24 గంటల్లో దేశంలో 75,809 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ ప్రకటించింది. అలాగే కరోనా బారిన పడి ఒక్కరోజు వ్యవధిలో 1,133 మంది మృతిచెందారు.

తాజా మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,775 మృతి చెందగా, చికిత్స అనంతరం 33,23,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 8,83,697 యాక్టివ్ కేసులున్నాయి. ఇదిలాఉండగా, గడచిన 24 గంటల్లో 10.98 లక్షల కరోనా టెస్టులు దేశంలో నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 5.06 కోట్లకు చేరింది.


Next Story