చెన్నూర్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

by  |
చెన్నూర్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
X

దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజలు ఘనంగా 74వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రామ్ లాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మండల అధ్యక్షుడు మంత్రి బాపు పాల్గొన్నారు. స్థానిక కొత్త బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రంలో బీజేపీ నగర అధ్యక్షుడు సుశీల్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.


Next Story

Most Viewed