మూడు అశ్వాలకు అస్వస్థత..!

by  |
మూడు అశ్వాలకు అస్వస్థత..!
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి సేవల్లో పాలు పంచుకునే మూడు అశ్వాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. మేత తిన్న కొద్ది సమయానికే అశ్వాలు కుప్పకూలిపోయాయి. దీనిని గమనించిన ఆలయ అధికారులు పశువైద్యాధికారుల సాయంతో వాటికి చికిత్సను అందిస్తుండగా.. అశ్వ అనే గుర్రం మృతి చెందింది. మిగతా రెండు గుర్రాల్లో ఒక్కటి పూర్తిగా కోలుకోగా.. మరొక్కటి చికిత్స పొందుతోంది. స్వామివారికి సేవలందించే అశ్వాలకు ఇలా జరగడంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి చిన్న వెంకన్న సేవ కోసం 20 నెలల క్రితం అశ్వ, శ్వేత అనే రెండు అశ్వాలను ఆలయానికి బహూకరించారు. మరోవైపు ద్వారకా తిరుమలకు చెందిన దేవస్థానం ఉద్యోగి శోభనగిరి ఏడాదిన్నర క్రితం యోగిని అనే అశ్వాన్ని ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆలయ అధికారులు వాటిని శ్రీవారి తిరువీధి సేవలకు, అలాగే ధనుర్మాస, కనుమ, బ్రహ్మోత్సవాలకు వినియోగిస్తున్నారు.



Next Story

Most Viewed