లాభాల్లో నడుస్తుంటే.. ప్రయివేటీకరించడం ఎందుకు

by  |
లాభాల్లో నడుస్తుంటే.. ప్రయివేటీకరించడం ఎందుకు
X

దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశ్ మాట్లాడుతూ… దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, లాక్‌డౌన్ కాలాన్ని బాగా ఉపయోగించుకుంటోందని అన్నారు. 109 రైల్వే మార్గాల ప్రైవేటీకరణ అందులో భాగమనే విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే కాక ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రభుత్వ రవాణా సంస్థ రైల్వేను, లాభాల్లో నడుస్తున్న క్రమంలో ప్రయివేటీకరించడం ఎందుకని ప్రశ్నించారు. 109 రైలు మార్గాల ప్రయివేటీకరణను వెంటనే నిలిపేయాలని, మహరత్నాలు, నవరత్నాలను కార్పొరేట్ల పరం చేయడాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed