ఇవాళ్టి నుంచి I-CET పరీక్ష..

by  |
ఇవాళ్టి నుంచి I-CET పరీక్ష..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పోస్టు గ్యాడ్యూయేషన్ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష I-CET ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.

థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు శరీర ఉష్ణోగ్రత అధికంగా నమోదైనా, ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్టు కనిపించినా.. వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 64,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 75 కేంద్రాల్లో నాలుగు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి.



Next Story

Most Viewed