మందుబాబులకు త్వరలో ముహూర్తం

by  |
మందుబాబులకు త్వరలో ముహూర్తం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పోలీసులు త్వరలో మందుబాబుల భరతం పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలలో నిలిపివేసిన డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ను తిరిగి నిర్వహించేందుకు త్వరలో ముహూర్తం పెట్టనున్నారు. బార్లు, పబ్‌లు ఓపెన్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కరోనా నిబంధనలు పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. పోలీసులు పీపీఈ కిట్లు ధరించి మరీ విధుల్లో పాల్గొననున్నారు. పెద్ద పెద్ద రహదారుల వద్దనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారని సమాచారం. అయితే, బ్రీత్ అనలైజర్‌ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Next Story

Most Viewed