- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్: కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంలా మారింది. నిజానిజాలు తెలుసుకునే స్థితిలో ఆ వ్యక్తి లేడు.ఈ క్రమంలోనే దంపతులిద్దరి మధ్య గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడైన భర్త తెల్లవారుజామున భార్య గొంతునులిమి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో పిట్లం మండలం గుడి తండాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..గుడితండాకు చెందిన శిరిష(23), పిట్లం మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత చారిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హైద్రాబాద్లోని శంషాబాద్ మామిడిపల్లిలో దంపతులు నివాసముండేవారు. అయితే శిరిషకు అంతకు మందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. శిరిష తల్లిదండ్రులు పదేండ్ల కిందటే మరణించగా, లాక్డౌన్ సమయంలో ఆమె గుడితండాకు వచ్చింది. అనంతరం బుధవారం హైద్రాబాద్ కు వెళ్లి భర్తను కలిసింది. అదే రోజు సాయంకాలం శ్రీకాంత చారి తన భార్యను పిట్లం మండల కేంద్రానికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి వారిద్దరి మధ్య మళ్లీ గొడవ తలెత్తింది. అనంతరం తెల్లవారు జామున శిరిష గొంతునులిమి హత్య చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దామోదర్ రెడ్డి తెలిపారు.