- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
సమాజంలో ప్రతి చిన్న విషయానికి మనిషి తన విచక్షణను కోల్పోతున్నాడు.ఈ క్రమంలోనే హత్యలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారు. ఇదంతా ఎలా జరిగిందని తెలుసుకునేలోపే తన జీవితం ముగిసిపోతుందని ఆలోచించే క్రమంలో ప్రస్తుతం మనిషి లేడు. దీనంతటికి కారణం ఒకటి మద్యం కాగా, మరోకటి మానసిక ప్రశాంతతను కోల్పోవడమే అని తెలుస్తోంది.
తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో కట్టుకున్న భర్తే భార్యను విచక్షణా రహితంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గార్లదిన్నె మండలం కల్లూరులో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. కల్లూరులో నివాసముంటున్న నాగభూషణం, పద్మావతి దంపతులు. వీరిద్దరూ తరుచుగా గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా దంపతులిద్దరి మధ్య వాగ్వివాదం తలెత్తింది. దాంతో సహనం కోల్పోయిన నాగభూషణం పక్కనే ఉన్న గొడ్డలితో భార్యను విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.