అర్థరాత్రి ప్రియుడితో కలిసి స్నానం చేస్తూ.. దొరికిపోయిన భార్య

by  |
అర్థరాత్రి ప్రియుడితో కలిసి స్నానం చేస్తూ.. దొరికిపోయిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పెండ్లి అయిన తర్వాత భర్తతో సంతోషంగా గడపాల్సిన భార్య మరో వ్యక్తికి అవకాశం ఇచ్చింది. అయితే, తనను కాదని ప్రియుడి కోరిక తీర్చుతున్న భార్యను భర్త తన్ని తరిమేశాడు. అర్ధరాత్రి ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న భార్య భాగోతాన్ని బట్టబయలు చేసి చెట్టుకు కట్టేసి కొట్టాడు.

కర్నాటకలోని విజయపురం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆలియాద గ్రామానికి చెందిన మల్లప్ప-సవిత కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో కలహాలు వచ్చాయి. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సవిత పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అయితే, భర్తకు తెలియకుండా సవిత ప్రియుడితో మాట్లాడటం ప్రారంభించింది. ఇది కాస్తా హద్దు మీరడంతో వారిద్దరు ఏకంతంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. భార్య కదలికలపై అనుమానం వచ్చిన భర్త అలాంటిది ఏమైనా ఉంటే మానుకోవాలని సూచించాడు. అయినప్పటికీ సవిత భర్త మాట లెక్క చేయకుండా ప్రియుడితో విచ్చలవిడిగా తిరుగుతుండేది. దీనిపై ఆగ్రహించిన భర్త అవకాశం కోసం ఎదరుచూస్తుండేవాడు.

ఇక ఓ రోజు రాత్రి ఏకాంతంగా కలుసుకుందామని సవిత ప్రియుడు కలిసి ప్లాన్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అదే రోజు రాత్రి భర్త, కుమారుడితో భోజనం చేసిన సవిత నిద్రపోతునట్లు నటించింది. మధ్య రాత్రి కాగానే మెల్లగా ఇంట్లో నుంచి లేచి బయటకు వెళ్లింది. ఇంతలో భర్తకు కూడా మెలకువ రావడంతో ఆమెకు తెలియకుండా వెంటనే వెళ్లాడు.

ప్రియుడితో కలిసి ఓ తోటలోకి వెళ్లడం గమనించిన భర్త మల్లప్ప.. భార్య భాగోతం బయటపెట్టేందుకు తన బాబాయ్, దగ్గరి బంధువులను పిలిచేందకు వెళ్లాడు. సరిగ్గా మల్లప్ప వారిని తీసుకొచ్చే సమయానికి సవిత-ప్రియుడు స్నానం చేస్తూ నగ్నంగా కనిపించారు. దీంతో ఆగ్రహించిన మల్లప్ప వారిద్దరిని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.



Next Story