ఆ కథనానికి స్పందించిన హెచ్‌ఆర్సీ

by  |
ఆ కథనానికి స్పందించిన హెచ్‌ఆర్సీ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కట్టుకున్న భర్త చనిపోయి పిల్లలు, ఇళ్లు లేని స్థితిలో జీవిస్తున్న వృద్ధురాలిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఈ మేరకు ‘దిశ’ దినపత్రికలో ‘పిల్లలు లేరు.. పింఛన్ వస్తలేదు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆయన స్పందించి కథనాన్ని సుమోటో‌గా స్వీకరించి నవంబర్ 13వ తేదీలోగా నివేదిక అందజేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 75ఏళ్ల వయస్సులో కూడా నా అనేవాళ్లు లేక, కనీసం పింఛన్ కూడా లేక, వృద్ధురాలు సంగం లక్ష్మి పడుతున్న బాధ తనను కలచి వేసిందని జస్టిస్ చంద్రయ్య అన్నారు. విచారణ నివేదిక అందిన అనంతరం ఆమెకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


Next Story

Most Viewed