మొక్కలంటే ఇంత అశ్రద్ధ వహిస్తే ఎలా..?

by  |
మొక్కలంటే ఇంత అశ్రద్ధ వహిస్తే ఎలా..?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ ఎంవీరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్ర‌కృతి వ‌నంలో మొక్క‌ల పెంప‌కం జ‌రుగుతున్న తీరును పరిశీలించారు. వనంలో రాళ్లు రప్పలున్నా తొలగించకుండా మొక్కలు నాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రాళ్లు తీయకుండా మొక్కలు నాటితే ఎలా బ్రతుకుతాయో ఆలోచన చేయకపోతే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు. పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే.. అధికారులు చేసే నిర్వాకం ఇదా అంటూ.. సర్పంచ్, కార్యదర్శి, డివిజనల్ పంచాయతీ అధికారికి షోకాజీ నోటీసులు జారీ చేయాలని డీపీఓకు సూచించారు.


Next Story