- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూర్నగర్: సూర్యపేట జిల్లా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ, ఆంధ్రా హిజ్రాలు ఒకరిపై ఒకరు బుధవారం ఫిర్యాదు చేసుకున్నారు. ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా జిల్లా చిల్లకల్లుకు చెందిన హిజ్రాలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారని, వీళ్లతో మాకు ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్లో తెలంగాణ హిజ్రాలు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి ఆంధ్రాకు చెందిన వారు ఆంధ్రాలో, తెలంగాణకు చెందిన హిజ్రాలు తెలంగాణలోనే అడుక్కోవాలని, ఇరు వర్గాలతో లిఖిత పూర్వకంగా కాగితంపై రాయించి సమస్యను తాత్కాలికంగా సర్దుమణిగించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. తెలంగాణకు చెందిన హిజ్రాలు ఆంధ్రాకు వెళితే.. ఆంధ్రాకు చెందిన హిజ్రాలు కొడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Next Story