కొవిడ్ బాధితులకు అధిక ఫీజులపై విచారణ

by  |
కొవిడ్ బాధితులకు అధిక ఫీజులపై విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో: కొవిడ్ బాధితులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. గుంటూరు వాసి తోట సురేష్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఏ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో నిర్ధిష్టంగా తెలుపలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.



Next Story

Most Viewed