రీ పోస్టుమార్టం వీడియో తీసి సీల్డ్ కవర్లో భద్ర పరచండి !

by  |
రీ పోస్టుమార్టం వీడియో తీసి సీల్డ్ కవర్లో భద్ర పరచండి !
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోవడంపై గురువారం పిటిషన్‌ దాఖలు కాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలపింది. మళ్లీ మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించి వీడియోను సిల్డ్ కవర్లో భద్రపరచాలని పేర్కొంది. మృతదేహాలను భద్రాద్రి ప్రభుత్వాస్పత్రిలో ఫ్రీజ్ చేయాలన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది.


Next Story