కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం..!

by  |
కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం..!
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో కరోనాకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రోజుకు 40వేల పరీక్షలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగింది. డబ్ల్యూహెచ్‎వో ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రిలో బెడ్లు ఎందుకు లేవని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ హైకోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.


Next Story