ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్..!

by  |
ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. వరుస ఎన్‎కౌంటర్లతో ఏజేన్సీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ అదనపు బలగాలు మోహరించాయి. పెంచికల్‎పేట, చింతలమానేపల్లి, కడంబ, కోటపల్లి, వేమనపల్లి, సిద్దేశ్వర గుట్ట ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కడంబ ఎన్‎కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు భాస్కర్, రాము, వర్గీస్, మీనా కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కడంబ ఎన్‎కౌంటర్‎లో మంగి దళ సభ్యుడు రాము గాయపడినట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed