- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆమె ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి, డ్రగ్ డీలర్తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే… ముంబైని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిపోతా అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన పార్టీపై ఆమె విమర్శలు గుప్పించారు. అధికారం కోసం శివసేన.. సోనియా సేనగా మారిపోయిందని విమర్శలు చేశారు. గురువారం వరస ట్వీట్లలో శివసేనపై విరుచుకుపడ్డారు.
‘వారు చేసే చిన్న తప్పుల కారణంగా దేవేంద్ర ఫడణవీస్జీ వారితో పొత్తుపెట్టుకోమని భాజపాకు సూచించి ఉంటారు. ఒకరు ఎప్పుడు బెదిరింపులకు లొంగి ఉండకూడదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత శివసేన పొత్తు పెట్టుకొని సోనియా సేనగా మారిపోయింది. ఒక సిద్ధాంతం ఆధారంగా శ్రీ బాలాసాహెబ్ ఆ పార్టీని నిర్మించారు. ఇప్పుడు అధికారం కోసం ఆ సిద్ధాంతాన్ని అమ్మేశారు. నేను లేని సమయంలో నా ఇంటిని కూలగొట్టిన సంస్థను సివిక్ బాడీగా పిలవొద్దు. ఈ విధంగా రాజ్యాంగాన్ని అబాసు పాలు చేయొద్దు. మీ తండ్రి చేసిన మంచి పనుల వల్ల మీరు సంపద పొందగలరు. కానీ, గౌరవాన్ని మీ అంతట మీరే సంపాదించుకోవాలి. మీరు నా గొంతు అణచాలని చూస్తే.. అది ఇంకా రెట్టింపవుతుంది. మీరు ఇంకా ఎంతమందిని ఇలా అణచివేస్తారు? ఎంతకాలం నిజం నుంచి దూరంగా పారిపోతారు? మీరు ఒక వంశానికి ఉదాహరణ మాత్రమే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.